India Meteorological Department దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు, పిడుగుల ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించారు.
Leave A Comment