నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీ అరేబియాలో బస్సు అగ్ని ప్రమాదానికి గురై 42 మంది మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో హైదరాబాదీలు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
The post సౌదీ బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి appeared first on Navatelangana.
Leave A Comment