నవతెలంగాణ – మెదక్ : మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం ముత్తాయిపల్లిలో 19 ఏళ్ల శిరీష అనే యువతిని తల్లిదండ్రులు మొబైల్లో గేమ్స్ ఆడొద్దని మందలించడంతో మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయింది. కూతురి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
The post మొబైల్లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు.. ఎలుకల మందు తాగిన యువతి appeared first on Navatelangana.
Leave A Comment