నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నై, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం బండవడ్డిపల్లె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మణికుమార్ (35), పుష్పరాజ్ (26) సంక్రాంతి పండుగకు ఊరికి వచ్చారు. పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ పోటీపడి మద్యం సేవించారు. దీంతో ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్నేహితులు వారిని ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యలోనే మృతిచెందారు. మణికుమార్కు భార్య, […]
The post బీర్లు తాగి.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి.. appeared first on Navatelangana.
Leave A Comment