నవతెలంగాణ – హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొనేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో సోమవారం ఉదయం మహాజాతరను ప్రారంభించాక హెలికాప్టర్లో హైదరాబాద్కు చేరుకుంటారు. ఉ.9.30గంటలకు శంషాబాద్ నుంచి సీఎం, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.
The post నేడు దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment