నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.4 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే 3రోజులు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో టెంపరేచర్లు 7-11 డిగ్రీల మధ్య నమోదవుతాయని చెప్పింది.
The post తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..10 జిల్లాలకు అలర్ట్! appeared first on Navatelangana.
Leave A Comment