నవతెలంగాణ-హైదరాబాద్: రాజుల పాలనలా ఇండియాను మార్చాలని బీజేపీ అనుకుంటోందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఉద్దేశం, గతంలో తీసుకువచ్చిన ‘మూడు నల్ల వ్యవసాయ చట్టాల’ ఉద్దేశం ఒకటేనని విమర్శించారు. జవహర్ భవన్లో గురువారం జరిగిన నేషనల్ ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్మికుల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కొత్త చట్టంతో బీజేపీ పాలిత రాష్ట్రాలకే పనులు, నిధులను కేంద్రం కేటాయిస్తుందని చెప్పారు. కేంద్రం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని వెనక్కి తీసుకుని ఎంజీఎన్ఆర్ఈజీఏను […]
The post రాజుల పాలనలా ఇండియాను మార్చాలని బీజేపీ సన్నాహాలు: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.
Leave A Comment