• Login / Register
  • Site Logo

    విరాట్ కోహ్లి తిరిగి బరిలోకి — 7 నెలల తర్వాత బ్లూ జెర్సీలో ఆరంగేట్రం!

    క్రీడలు

    టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి దాదాపు ఏడునెలల విరామం తర్వాత మళ్లీ బ్లూ జెర్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. రేపు (అక్టోబర్ 19) ప్రారంభమయ్యే భారత్–ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో కోహ్లి పాల్గొననున్నారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది.

    కోహ్లి ఈ సిరీస్‌ను తన 2027 వరల్డ్ కప్ సన్నాహకంగా భావిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకున్న ఆయన, ఫిట్‌నెస్ మరియు ఫామ్‌ను తిరిగి పొందేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని జట్టు వర్గాలు తెలిపాయి.

    ఇక మరోవైపు, జట్టు కూర్పులో ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో ఆటగాడిగా మాత్రమే పాల్గొనగా, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

    క్రికెట్ అభిమానులు కోహ్లి బరిలో అడుగుపెట్టడాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ భారత జట్టుకు వరల్డ్ కప్ తర్వాత కొత్త సమీకరణాల పరీక్షగా మారనుంది.

    Download Main Image

    Leave A Comment