• Login / Register
  • క్రీడలు

    ముంబయి ఇండియన్స్‌కు పెనాల్టీగా నోబాల్‌

    ముంబయి ఇండియన్స్‌కు పెనాల్టీగా నోబాల్‌

    స్పోర్ట్స్ డెస్క్‌: ఐపీఎల్‌  2025 సీజన్‌లో భాగంగా బుధవారం ముంబయి ఇండియన్స్‌ 
    , దిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ రూల్‌ బ్రేక్‌ చేసినందుకు అంపైర్లు ముంబయి ఇండియన్స్‌కు నోబాల్‌ను పెనాల్టీగా విధించారు. అయిదో ఓవర్లో మూడో బంతిని విల్‌జాక్స్‌ విసిరాడు. దాన్ని విప్రాజ్‌ నిగమ్‌ ఎదుర్కొన్నాడు. ఆ బాల్‌ను అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు. ఆ సమయంలో ఆఫ్‌సైడ్‌లో కేవలం ముగ్గురు ఫీల్డర్లే ఉండటం దీనికి కారణం. నిబంధనల ప్రకారం ఆన్‌సైడ్‌లో అయిదుగురికి మించి ఫీల్డర్లు ఉండకూడదు. కాని ఉండటంతో అంపైర్‌ నోబాల్‌ను పెనాల్టీగా విధించాడు. 

    ఇక మ్యాచ్‌ విషయానికొస్తే... ఈ పోరులో సూర్యకుమార్‌ యాదవ్‌  73* పరుగులతో తన సత్తా చాటి, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. బదులుగా దిల్లీ క్యాపిటల్స్‌ 18.2 ఓవర్లకు 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబయి ఇండియన్స్‌ 59 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబయి ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. దీంతో దిల్లీ క్యాపిటల్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

    Leave A Comment