భారత ప్రభుత్వం డిజిటల్ స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది. విదేశీ మెసేజింగ్ యాప్లకు ప్రత్యామ్నాయంగా, దేశీయంగా అభివృద్ధి చేసిన ‘అరట్టై’ మెసేజింగ్ యాప్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ వర్గాలు గట్టి మద్దతు ప్రకటించాయి.
డేటా భద్రత, గోప్యత, జాతీయ డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం లక్ష్యంగా ఈ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ను ప్రభుత్వాధికారులు ముఖ్యంగా ప్రోత్సహిస్తున్నారు. అమెరికా ఆధారిత టెక్ ఉత్పత్తులపై ఆధారపడకుండా, స్వదేశీ పరిష్కారాలను వినియోగించాలి అనే కేంద్ర ప్రభుత్వ దృక్కోణానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు.
డేటా లోకలైజేషన్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ గోప్యత అంశాలపై పెరుగుతున్న చర్చల నేపథ్యంలో, భారతీయ మెసేజింగ్ సొల్యూషన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం ఇది. ప్రభుత్వం ఉద్యోగులు, శాఖలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లలో కూడా ఈ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.
స్వదేశీ యాప్లు బలోపేతం కావడం ద్వారా, భారతదేశం టెక్నాలజీ స్వయం సమృద్ధి లక్ష్యానికి మరింత చేరువ అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Leave A Comment