నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన సీఎస్కే.. WPLలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భవిష్యత్లో విమెన్స్ ప్రీమియర్ లీగ్లో పెట్టుబడులు పెట్టడానికి తమకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని ప్రకటించారు. భవిష్యత్లో ఇతర క్రీడల్లో కూడా తమ ఫ్రాంచైజీ విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం WPLలో ఐదు జట్లు ఆడుతున్నాయి.
The post WPLలోకి అడుగుపెట్టనున్న సీఎస్కే..! appeared first on Navatelangana.
Leave A Comment