నవతెలంగాణ-కాటారం : మంగళవారం భూపాలపల్లి జిల్లాలో జరిగిన ”అస్మిత ఖేలో ఇండియా ”విభాగంలో కాటారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలోని విద్యార్థినిలు ప్రతిభను కనబరిచారు. నలుగురు విద్యార్థినిలు రికిత,సిరివల్లి,అకిత, రికిత లు ప్రథమ స్థానంలో నిలువగా, ఆరుగురు విద్యార్థినిలు అలీజా, సిరివల్లి, ఇందు,పావని, వికిత,సిరివల్లి ద్వితీయ స్థానంలో నిలిచారు. విద్యార్థులను జిల్లా సెక్రటరీ పూతల సమ్మయ్య, ప్రిన్సిపల్ నాగలక్ష్మి,సీనియర్ వైస్ ప్రిన్సిపల్ సరిత, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ కల్పన, పిడి గౌతమి, పిఇటి శ్రీవిద్య,ఉపాధ్యాయులు అభినందించారు.
The post “అస్మిత ఖెలో ఇండియా” క్రీడలో మెరిసిన ఆణిముత్యాలు appeared first on Navatelangana.
Leave A Comment