నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల హౌసింగ్ ఏఈ హనుమంతు సేవలు అమూల్యమైనవని మేనూర్ సర్పంచ్ అశోక్ పటేల్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆయన కృషిని ప్రభుత్వం గుర్తించి గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ పరంగా అవార్డు అందించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం అవార్డు అందుకున్న హౌసింగ్ ఏ ఈ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు జుబ్రే సురేష్, పంచాయతీ కారోబార్, పలువురు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.
The post హౌసింగ్ ఏఈ హనుమంత్ సేవలు అమూల్యం: సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment