నవతెలంగాణ చర్లపల్లి: హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. మృతులను బోడుప్పల్ కు చెందిన సురేందర్ రెడ్డి, విజయ, చేతనగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
The post హైదరాబాద్ లో విషాదం…రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం appeared first on Navatelangana.
Leave A Comment