నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 67 మంది మృతి చెందారు. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికి తీస్తున్నారు. దుబాయ్ క్రాకరీ అనే షాపులో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాపు లోపల దాక్కోగా, ఊపిరి ఆడక మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.
The post షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం..67 మంది మృతి appeared first on Navatelangana.
Leave A Comment