నవతెలంగాణ – వేములవాడ రూరల్: వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న బూర్ల నవీన్ (30) లివర్ వ్యాధితో గురువారం సాయంత్రం మృతి చెందాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నవీన్కు వైద్యులు కాలేయ వ్యాధి ఉందని నిర్ధారించడంతో, కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేసి కుటుంబాన్ని […]
The post లివర్ వ్యాధితో పంచాయతీ కార్మికుడు మృతి.. appeared first on Navatelangana.
Leave A Comment