నవతెలంగాణ-రాయికల్పట్టణ కేంద్రం నుండి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే తారు రహదారులు గతంలో కురిసిన వర్షాలు,వరదల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి.రోడ్లపై గుంతలు, చీలికలు,మట్టి గడ్డలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కానీ సంవత్సరాలుగా ఎలాంటి మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీసం ప్రమాద సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ఇరువైపులా కోతలతో ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు రోడ్లను కప్పేయడంతో […]
The post రోడ్లకు మరమ్మతులు చేసేది ఎప్పుడు appeared first on Navatelangana.
Leave A Comment