నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుపై కేసు నమోదు అయింది. తిరుపతిలోని తిరుచానూరు స్టేషన్లో వీరితో పాటు MBU (మోహన్ బాబు యూనివర్సిటీ) పీఆర్వో సతీష్పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీకి చెందిన MBUలో అధిక ఫీజులపై కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్తున్న సమయంలో విద్యార్థి సంఘం నేతలు అక్బర్, వినోద్లను MBU బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.
The post మోహన్ బాబు, విష్ణుపై కేసు నమోదు.. appeared first on Navatelangana.
Leave A Comment