నవతెలంగాణ – తొగుటమృతుని కుటుంబానికి బియ్యం అందజేశామని పండు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. శనివారం మండలంలోని తుక్కా పూర్ గ్రామానికి చెందిన దూలం నర్సాగౌడ్ గత కొంత కాలంగా బాధపడుతూ కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. పండు ఫౌండేషన్ తరపున చిక్కుడు స్వామి మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించారని వారు తెలిపారు. ఈ కార్యక్ర మంలో గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
The post మృతుని కుటుంబానికి బియ్యం అందజేత.. appeared first on Navatelangana.
Leave A Comment