• Login / Register
  • Site Logo

    మావోయిస్టు అగ్రనేత సంగ్రామ్ భార్య సుగుణ మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్‌ సంగ్రామ్‌ భార్య బిచ్చె సుగుణ అనారోగ్య కారణాలతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా మజ్జిమేండ్రి గ్రామంలో మృతిచెందారు. బస్తర్‌ అడవుల కేంద్రంగా ఆమె విప్లవోద్యమంలోకి వచ్చారు. ఆదివాసీ మహిళా సంఘం సభ్యురాలిగా చేరి తర్వాత డివిజన్‌ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో కేంద్ర కమిటీ సభ్యుడైన సంగ్రామ్‌ను వివాహం చేసుకున్నారు.

    The post మావోయిస్టు అగ్రనేత సంగ్రామ్‌ భార్య సుగుణ మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment