నవతెలంగాణ – రాయికల్మండలంలోని ఆలూరు, రాజనగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ఒక్కో గ్రామానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. శుక్రవారం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యా, వైద్య రంగాలతో పాటు మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. […]
The post మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment