నవతెలంగాణ – మక్తల్ : మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో 18 గొర్రెలు మృతి చెందాయి. రైలు పట్టాల పక్కన మేత మేస్తున్న గొర్రెలు అకస్మాత్తుగా పట్టాలపైకి వెళ్లాయి. ఈ సమయంలో రాయచూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు వాటిని ఢీకొట్టింది. అక్కడిక అక్కడే 18 గొర్రెలు మృతి చెందినట్లు యజమాని కురువ వెంకటప్ప తెలిపారు నష్టపోయిన గొర్రెల యజమాని కుర్వ వెంకటప్పను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
The post మక్తల్ రైలు కింద పడి 18 గొర్రెల మృతి appeared first on Navatelangana.
Leave A Comment