నవతెలంగాణ మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామ్ రెడ్డి (79) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం పెద్దపల్లి ముత్తారం మండలం ఖమ్మం పల్లి. ఆయన గతంలో ఖమ్మం పల్లి సర్పంచిగా, ముత్తారం ఎంపీపీగా పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇవాళ ఆయన భౌతికకాయాన్ని మంథనికి తరలించి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.
The post మంథని మాజీ ఎమ్మెల్యే కన్నుమూత appeared first on Navatelangana.
Leave A Comment