• Login / Register
  • Site Logo

    బీసీ వసతిగృహంలో 86 మంది విద్యార్థులకు అస్వస్థత

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహంలో ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా… శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతిగృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్‌లో గద్వాల ఏరియా ఆస్ప‌త్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నట్లు కోదండాపురం ఎస్సై మురళి తెలిపారు.

    The post బీసీ వసతిగృహంలో 86 మంది విద్యార్థులకు అస్వస్థత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment