నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపూర్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, థాన్లాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే వంగ్జాగిన్ వాల్టే (61) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వాల్టే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
The post బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత appeared first on Navatelangana.
Leave A Comment