నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో, సహాయక చర్యల కోసం వెళ్లిన సీఐ శ్రీధర్కు గాయాలయ్యాయి. కంకరలో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీయడానికి జేసీబీతో పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసే సమయంలో ప్రమాదవశాత్తూ సీఐ శ్రీధర్ కాళ్ల మీద నుంచి జేసీబీ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
The post బస్సు ప్రమాదం.. రెస్క్యూ కోసం వెళ్లిన సీఐకి గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment