నవతెలంగాణ – హైదరాబాద్ : జన్మదిన వేడుకలో విషాదం నెలకొంది. రాజన్న సిరిసిల్లలో పుట్టినరోజు జరుపుకుంటున్న 15ఏళ్ల మణిదీప్ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. సాయినగర్కు చెందిన ప్రశాంత్–లావణ్య దంపతుల కుమారుడైన మణిదీప్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు అతడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
The post బర్త్డే వేడుకల్లో బాలుడి మృతి appeared first on Navatelangana.
Leave A Comment