• Login / Register
  • Site Logo

    ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట

    Rss వార్తలు

    నవతెలంగాణ – కొల్లాపూర్‌ రూరల్‌నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ రేంజ్‌ పరిధిలోని ముక్కుడిగుండం అటవీ ప్రాంతంలోని వట్టిమాకుల కుంట ఏరియాలో అడవిని కొట్టి చెట్లను కాలుస్తున్న విషయం తెలుసుకొని అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ విధంగా అడవిని నరికి వేయడం చట్టరీత్యా నేరమని గిరిజన రైతులకు అటవీశాఖ అధికారులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు రైతులు మధ్య కాస్త తోపులాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ జయరాజ్‌ గాయపడ్డట్లు సమాచారం.

    The post ఫారెస్ట్‌ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment