నవతెలంగాణ-బెజ్జంకిగ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని సర్పంచ్ ఎర్రల జానకి మండలాధికారులను కోరారు. సోమవారం మండల పరిధిలోని గాగీళ్లపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో త్రాగునీటి సరఫరా,పారిశుధ్యం, ఉపాధి పనులు,విద్యా,ఆరోగ్యం,వ్యవసాయ శాఖ సమస్యలపై సర్పంచ్ జానకి వార్డ్ సభ్యులతో సమీక్షా సమావేశం ఏర్పాటుచేసి చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి పాము రాజేంద్ర ప్రసాద్,అయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
The post ప్రజా సమస్యలపై ప్రత్యేక చొరవ.. appeared first on Navatelangana.
Leave A Comment