నవతెలంగాణ – భిక్కనూర్మండలంలోని మల్లుపల్లి గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఐ బాలయ్య పౌర హక్కుల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా కలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ సుజాత, జీపీఓ లింగయ్య, ఎస్సీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సాయిలు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
The post పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం appeared first on Navatelangana.
Leave A Comment