నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలోని జీపీ రికార్డులను భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శ్రీలత మంగళవారం క్యూ రిజిష్టర్, సిబ్బంది రోజువారి రిజిస్టర్ తదితర రికార్డులను తనిఖీలు నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. నీరు సరఫరా అవుతున్న వాటర్ ట్యాoకులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి పాల్గొన్నారు.
The post పంచాయతీ రికార్డులు తనిఖీ చెసిన డీపీఓ శ్రీలత appeared first on Navatelangana.
Leave A Comment