నవతెలంగాణ-హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కోర్టుకు వస్తారని సమాచారం. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేటకు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.
The post నేడు సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ appeared first on Navatelangana.
Leave A Comment