నవతెలంగాణ – మద్నూర్ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పదని, నిరుపేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. సోమవారం డోంగ్లి మండల కేంద్రంలో సన్నబియ్యం బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన లబ్ధిదారులకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
The post నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment