నవతెలంగాణ – హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వయంపాలన అమలులోకి వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను, తెలంగాణ ఏర్పాటులో ఆర్టికల్ 3 పాత్రను ఆయన గుర్తుచేసుకున్నారు. వివక్షత లేని, సమానత్వంతో కూడిన సమాజం కోసం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ నిరంతరం కృషి చేస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
The post తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు appeared first on Navatelangana.
Leave A Comment