నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచర్లలోని కాపురం బ్లాక్-1 ఓసీపీలో బొగ్గునిక్షేపాలు వెలికితీస్తున్న ఏఎ మ్మార్ కంపెనీ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఓసిపిలో ఏఎమ్మార్ హెడ్ ప్రభాకర్ రెడ్డి కార్మికులు, ఉద్యోగులకు క్రీడోత్సవాలను శనివారం ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 25న బహుమతులు ప్రదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, హెచ్తర్ డీజీఎం రవికుమార్ పాల్గొన్నారు.
The post తాడిచెర్ల ఓసీపీలో ప్రారంభమైన క్రీడోత్సవాలు.! appeared first on Navatelangana.
Leave A Comment