నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. నగరంలోని ఓ పాఠశాలకు గురువారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. చాణక్యపురిలోని సంస్కృతి పాఠశాలకు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది. అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సోదాలు చేశారు. […]
The post ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం appeared first on Navatelangana.
Leave A Comment