నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఎర్రకోట సమీపంలో ఓ కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు కారులకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా, బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
The post ఢిల్లీలో బాంబు పేలుళ్లు కలకలం appeared first on Navatelangana.
Leave A Comment