నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం జిల్లా బోనకల్లులోని ఎస్సీ బాలికల గురుకుల కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. అధ్యాపకురాలు తిట్టిందని మనస్తాపంతో విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
The post టీచర్ తిట్టిందని.. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్ appeared first on Navatelangana.
Leave A Comment