• Login / Register
  • Site Logo

    జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం..రూ.30 లక్షల వెండి మాయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోమేశ్వర జ్యువెలర్స్‌లో నవంబర్ 7న రాత్రి భారీ దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు షాపు గోడకు కన్నం పెట్టి, సుమారు 18 కిలోల వెండిని, మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.29.70 లక్షల విలువైన వస్తువులను దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

    The post జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం..రూ.30 లక్షల వెండి మాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment