నవతెలంగాణ- జన్నారంకత్తెరపాక రాజేశ్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్లో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నగరి ప్రీతం నుంచి ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. జన్నారం మండలంతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ప్రీతం కోరారు. ఈ నియామకం పట్ల రాజేశ్ సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీ బలోపేతానికి పనిచేస్తానని తెలిపారు.
The post జన్నారం జాయింట్ సెక్రటరీగా రాజేశ్ appeared first on Navatelangana.
Leave A Comment