నవతెలంగాణ-హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో రెండు బైక్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
The post ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ appeared first on Navatelangana.
Leave A Comment