నవతెలంగాణ – బాల్కొండ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీకి సోమవారం గ్రామ ఉపసర్పంచ్ తోకల ఉదయ్ కుమార్ 100 కుర్చీలను వితరణ చేశారు. గ్రామంలో పలు కార్యక్రమాలకు కుర్చీల అవసర నిమిత్తం ఇవ్వడం జరిగిందని ఉపసర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సట్ల గంగా ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
The post గ్రామ అభివృద్ధి కమిటీకి కుర్చీల వితరణ appeared first on Navatelangana.
Leave A Comment