నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో వీరి భేటీ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ తో నిన్న హరీశ్ రావు భేటీ అయిన సంగతి తెలిసిందే. సిట్ అడిగే ప్రశ్నలు, సమాధాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది.
The post కేసీఆర్ తో సమావేశమైన కేటీఆర్ appeared first on Navatelangana.
Leave A Comment