నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని కరూర్లో నెల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలను నటుడు విజయ్ పరామర్శించారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో జరిగిన ఈ సమావేశంలో 41 మంది మృతుల కుటుంబాలకు చెందిన 37 కుటుంబాలతో పాటు సుమారు 200 మంది హాజరయ్యారు. ఈ మీటింగ్లో ఇతరులకు ప్రవేశం ఇవ్వలేదు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, సాయం అందించే దిశగా విజయ్ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
The post కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలిసిన విజయ్ appeared first on Navatelangana.
Leave A Comment