నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా పోచారం సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డుపై నుంచి కింద పడిపోవడంతో నవీన్ (30), మౌనిక (36) అక్కడికక్కడే మృతి చెందారు. సుశ్రుతకు తీవ్ర గాయాలవగా, హరిప్రసాద్, అగస్త్య, అమృతలకు కూడా గాయాలయ్యాయి. వీరంతా జూ పార్కు నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
The post ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా.. ఇద్దరు మృతి appeared first on Navatelangana.
Leave A Comment