నవతెలంగాణ – హైదరాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మారేడుమిల్లిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పలు చోటుచేసుకున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
The post అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టుల మృతి appeared first on Navatelangana.
Leave A Comment