నవతెలంగాణ-హైదరాబాద్ : నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్నిమాపక నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
The post అగ్నిప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటన.. appeared first on Navatelangana.
Leave A Comment