నవతెలంగాణ – హైదరాబాద్ : మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. భారత్ విజయావకాశాలపై మాట్లాడిన ధోనీకి.. కామెంటేటర్గా చేయొచ్చు కదా అన్నప్రశ్న ఎదురైంది. దీనిపై ధోనీ స్పందిస్తూ..‘‘ గణాంకాలను గుర్తుంచుకోవడం నాకు చాలా కష్టం. ఆటను వర్ణించడం, ఆటగాళ్లను విమర్శించడం మధ్య సన్నటి గీత మాత్రమే ఉంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మ్యాచ్ సమయంలో వ్యాఖ్యానం చేయడం కళ’’ అని ధోనీ తెలిపాడు.
The post అందుకే కామెంటేటర్గా చేయను: ధోనీ appeared first on Navatelangana.
Leave A Comment