• Login / Register
  • హోమ్

    విజయనగరంలో ఉగ్రమూలాల కేసు

    రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

    విజయనగరంలో ఉగ్రమూలాల కేసు

    విజయనగరం, విశాఖ సమాచారం: విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో నిందితులు సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. సమీర్‌, సిరాజ్‌ కలిసి అల్‌హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ సంస్థను స్థాపించారు. ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకోగా.. ఇందులో సిరాజ్‌, సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు. ఈ ఆరుగురి ముఠా 3 రోజుల పాటు హైదరాబాద్‌లో కలిసే ఉంది. ఐసిస్‌ హ్యాండ్లర్‌ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై వీరు చర్చించారు. సమీర్‌, సిరాజ్‌ పేలుడు పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టారు. యూట్యూబ్‌లో పేలుడు పదార్థాల తయారీ విధానం చూశారు. 
    బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు రాగా.. మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి. మరోవైపు అరెస్టు సమయంలో సిరాజ్‌ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. ఈ కేసు విషయంలో ఎన్‌ఐఏ అధికారులు విజయనగరం టూటౌన్‌ స్టేషన్‌కు వెళ్లారు. కేసుకు సంబంధించిన విషయాలపై అక్కడి పోలీసులతో ఎన్‌ఐఏ అధికారులు మాట్లాడారు. మరోవైపు సమీర్‌ కాంటాక్టులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్‌లో లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేస్తోన్న సమీర్‌.. తల్లి, సోదరితో కలిసి సికింద్రాబాద్‌ బోయిగూడ రైల్‌ కళారంగ్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆ కాలనీ వద్ద పోలీసులు నిఘా పెట్టారు.

    Leave A Comment