లంకెలపాలెం జంక్షన్ లో బొగ్గు లారీ బీభత్సం
లంకెలపాలెం జంక్షన్ లో బొగ్గు లారీ బీభత్సం
త్రుటిలో తప్పిన ప్రమాదం
పరవాడ, విశాఖ సమాచారమ్: జీవీఎంసీ 79 వ వార్డు లంకెలపాలెం జంక్షన్లో బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 6:30 సమయంలో డివైడర్ మధ్యలో ఉన్న సిగ్నల్ పోల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో ఒక ఆటో, కారు ప్రమాదానికి గురి అయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ఆక్రమణల వలన ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్ అండ్ బి స్థలాలను ఆక్రమించి చిన్న చిన్న షాపులకు అద్దెలకు ఇచ్చుకోవడం వలన ప్రజలు ఇక్కడ రోడ్లపై ఎండలో మరియు వర్షంలో నిలబడవలసి వస్తుందని వారు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు.
Leave A Comment